ప్రజా పాలన
గౌరవనీయులైన ప్రజలకు నమస్కారం,
ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలనలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, సంక్షేమం మరియు అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మా ప్రభుత్వం పనిచేస్తోంది. మేము పాలకులు కాదు... సేవకులం అనే భావనతో ప్రజల ఆశలు, అవసరాలనే కేంద్రబిందువుగా తీసుకుని నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుతున్నాం.
ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో