ఇల్లు కట్టాలంటే కాంక్రీటు, ఇటుకలు, సిమెంటు, కలప... ఒక్కటేమిటి ఎన్నెన్నో కావాలి. వాటికోసం లక్షల రూపాయలు వెచ్చించాలి. ఇదంతా ఒకవైపు. చైనాలోని షాంగ్జీ, హెనన్ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం అలాంటి హంగుల జోలికి వెళ్లరు. గొయ్యి తవ్వి ప్రాచీనమైన, పర్యావరణ అనుకూలమైన భూగర్భ గృహాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటారు. ఈ భూగర్భ గృహాలను ‘యావోడాంగ్’, ‘పిట్హౌజ్’లని పిలుస్తారు.